అభిజిత్ ఫ్యాన్స్‌పై కేసు పెట్టిన మోనాల్

గత వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మోనాల్.. ఇప్పుడు బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ అభిజిత్ ఫ్యాన్స్‌పై కేసు పెట్టడం సంచలనంగా మారింది. ప్రస్తుతం బిగ్‌బాస్ 4 ఫైనల్ వీక్ జరుగుతుంది. మరికొద్దిరోజుల్లో షో ముగియనున్న క్రమంలో ఇప్పుడు మోనాల్ అభిజిత్ ఫ్యాన్స్‌పై కేసు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. తన సోదరి హేమాలి హౌస్‌లోకి వచ్చినప్పుడు అభిజిత్‌క ఒక సలహా ఇచ్చిందని, తన వెనుక కాకుండా తనతో నేరుగా మాట్లాడమని అభిజిత్‌కు చెప్పిందంది. అంతకుముందు అభిజిత్ కొన్నిసార్లు తన వెనుక మాట్లాడటం వల్లే అలా చెప్పిందని తెలిపింది.

monal gajjar

అయితే దీనిని గుర్తుపెట్టుకుని అభిజిత్ ఫ్యాన్స్ తన సోదరిపై దారుణంగా కామెంట్స్ పెట్టారని మోనాల్ చెప్పింది. ఆమెను చంపుతానని బెదిరించారని, దీని వల్ల తన సోదరి చాలా భయపడిందని మోనాల్ చెప్పింది. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు అభిజిత్ ఫ్యాన్స్‌పై ఫిర్యాదు చేశానని చెప్పింది.

కాగా హౌస్‌లోకి అడుగుపెట్టినప్పుడు కొద్దిరోజులు అభిజిత్, మోనాల్ చాలా క్లోజ్‌గా ఉన్నారు. ఆ తర్వాత అఖిల్‌కు మోనాల్ క్లోజ్ కావడంతో అభిజిత్ దూరమయ్యాడు. గత కొన్నివారాలుగా అభిజిత్, మోనాల్‌కి అసలు మాటలు లేవు. అభిజిత్ విన్నర్ అవుతాడనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మోనాల్ కంప్లైట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.