జెనీలియా కొత్త బిజినెస్.. వెజ్ లో నాన్ వెజ్!

టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని సినిమా ఇండస్ట్రీలో తన నటనతో మంచి క్రేజ్ అందుకున్న జెనీలియా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ భర్త రితేష్ దేశ్ ముఖ్ తో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ జంట ఒక కొత్త బిజినెస్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చింది.

కొన్నాళ్ల క్రితం ఈ జంట ప్యూర్ వెజిటేరియన్ గా మారిన విషయం తెలిసిందే. మాంసహారం మనేయలని చాలా మందికి ఉంటుంది. కానీ శాకాహారంతో అది సాధ్యం కాదు. అందుకే జెనీలియా ఆమె భర్త కలిసి ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారట. ఇమాజిన్ మీట్స్ అనే పేరుతో మొక్కల ఆధారంగా మాంసం ఆహారాలను తయారు చేసే సంస్ధతో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. వాటి వాసన, రుచి కూడా మాంసం మన ముందు ఉందనేలా ఒక భావనను కలిగిస్తాయట. అలాంటి ఫుడ్ బిజినెస్ ని స్టార్ట్ చేయబోతున్నట్లు వివరణ ఇచ్చిన జెనీలియా త్వరలోనే పార్తి వివరాలను అందిస్తామని సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.