భర్త సహాయంతో ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన ప్రియమణి

నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణిని సౌత్ ఆడియెన్స్ అంత ఈజీగా మర్చిపోలేరు. ఆమె హీరోయిన్ పాత్రలకు దురమైనప్పటికి తెలుగులో ఎప్పటికి గుర్తిండిపోయే సినిమాలు చేశారు. ముఖ్యంగా యమదొంగతో అమ్మడికి తెలుగులో మంచి క్రేజ్ దక్కింది..అయితే ఇటీవల ఆమె తన భర్తతో కలిసి ఒక అభిమానులకు షాక్ ఇచ్చింది.

ప్రియమణి రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో వైరల్ గా మారింది. ఎందుకంటే అమ్మడు WWE స్టార్ రేంజ్ లో బాడీని పెంచినట్లు అనిపించింది. నిజంగా ఒక్క క్షణం అందరు ఆశ్చర్యపోయారు. కానీ అది నిజం కాదు. ప్రియమణి వెనుక ఆమె భర్త ముస్తఫా రాజ్ నిలబడి తన చేతులను చూపించాడు. ఇక అందుకు తగ్గట్లు ప్రియమణి కూడా మంచి స్టిల్ ఇవ్వడంతో ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. 2017లో ముస్తఫాను పెళ్లి చేసుకున్న ప్రియమణి ప్రస్తుతం బెంగుళూరులో ఉంటోంది.