అఖిల్ మూవీ.. నాగ్ డైరెక్టర్ తో కాదు..

అక్కినేని యువ హీరో అఖిల్ చాలా కాలం నుంచి బాక్సాఫీస్ హిట్ కోసం తీవ్రంగా కష్టపడుతున్న విషయం తెలిసిందే. నెక్స్ట్ బొమ్మరిల్లు భాస్కర్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో రానున్న అఖిల్ ఆ తరువాత ఎవరితో వర్క్ చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ లాక్ డౌన్ లోనే నాగార్జున తనయుడి కోసం రెండు మూడు కథలను సెట్ చేసినట్లు రూమర్ వచ్చాయి.

అందులో నాగార్జునతో రగడ వంటి సినిమా చేసిన వీరుపోట్ల రాసిన కథ కూడా ఉందని టాక్ వచ్చింది. ఆ విషయం కనుక్కోగా అందులో ఎలాంటి నిజం లేదని తెలిసింది. ఎందుకంటే ప్రస్తుతం వీరుపోట్ల ఆహా యాప్ లోనే ఒక వెబ్ సిరీస్ ని ప్లాన్ చేస్తున్నాడు. ఇక అఖిల్ తరువాత ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అనే విషయంలో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం అఖిల్ దృష్టి మొత్తం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పైనే ఉంది. ఆ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని ఎదురుచూస్తున్నాడు.