కంగనా ఛాలెంజ్.. నిరూపించకపోతే పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా!

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి చెంది నెల రోజులు గడుస్తున్నా కూడా ఇంకా అనుమానాలు పుట్టుకొస్తునే ఉన్నాయి. అసలు సుశాంత్ మరణానికి నెపోటిజమే కారణమా లేక హత్య జరిగిందా అనే విషయంలో క్లారిటీ ఇవ్వాలని చాలా మంది కోరుకుంటున్న నేపథ్యంలో తన స్టేట్మెంట్ తీసుకోవాలని కంగానా పోలీసులను కోరింది.

సుశాంత్ మరణించిన అనంతరం నెపోటిజమ్ బాలీవుడ్ లో భూతంలా విస్తరించిందని కంగనా కొంతమంది సినీ పెద్దలపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ విమర్శలు నిరూపించకపోతే తనకు వచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తాను అంటూ ఆమె ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఛాలెంజ్ చేశారు. తన స్టేట్మెంట్ తీసుకోవడానికి ఎవరినైనా పంపించాలని పోలీసులను కోరాగా వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదని కంగనా వివరణ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.