కరోనాతో తిరుపతి ఎంపీ మృతి

తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద రావు (64) బుధవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఇటీవలే కరోనా వైరస్‌ బారిన పడిన ఎంపీ దుర్గాప్రసాద్ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతుండగా బుధవారం సాయంత్రం బల్లి దుర్గాప్రసాద్‌కు ఒక్కసారిగా తీవ్ర గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఆసుపత్రి అనుమతి తీసుకోని దుర్గాప్రసాద రావు మృతదేహాన్ని రేపు ఆయన స్వస్థలానికి తీసుకోని రానున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో దుర్గా ప్రసాద రావు అంత్యక్రియలు చేయనున్నారు.