సెకండ్ డోస్ వేయించుకున్న రజినీ…

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం సిరుత్తై శివ దర్శకత్వంలో అన్నాత్తే సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే హైదరాబాద్ లో తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న రజినీ, చెన్నై వెళ్లిన సంగతి తెలిసిందే. త్వరలో అమెరికా వెళ్లనున్న రజినీకాంత్, చెన్నై చేరగానే సెకండ్ డోస్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. కూతురితో ఐశ్వర్య సహకారంతో రజినీ ఇంట్లోనే వ్యాక్సినేషన్ తీసుకున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని రజినీ సూచించాడు.