సెకండ్ షెడ్యూల్ లో శాకుంతలం

ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో ఇండియా వైడ్ కాంప్లిమెంట్స్ అందుకున్న స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత. రాజీ పాత్రలో తమిళ టెర్రరిస్ట్ గా సమంత యాక్టింగ్ కి ఫిదా అవ్వని వాళ్ళే ఉండరు. అంత అద్భుతంగా నటించిన సామ్, ప్రస్తుతం నటిస్తున్న సినిమా శాకుంతలం. గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాలో సమంత తొలిసారిగా పౌరాణిక పాత్రలో నటిస్తోంది. ఇటివల ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా ఆగిపోయింది ఈ సినిమా షూటింగ్ ని చిత్ర యూనిట్ మళ్లీ స్టార్ట్ చేశారు. ఈ సోషియో ఫాంటసీ చిత్రం సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

ఈ చిత్రంలో దుష్యంతుడు పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. గ్రాఫిక్స్ ప్రాధాన్యం ఇస్తూ అత్యున్నత సాంకేతిక విలువలతో శాకుంతలం సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో సమంత కొడుకు పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభిరామ్, అల్లు అర్జున్ కొడుకు అయాన్ లలో ఎవరో ఒకరు చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.