చిల్లర ఏరుకుని తనకు చికెన్ వండి పెట్టేవారని: బెక్కం వేణు గోపాల్ గురించి నక్కిన త్రినాథ రావు

ఈ రోజు రోటీ కపడా రొమాన్స్ సినిమా నుండి లిరికల్ సాంగ్ లాంచ్ కావడం జరిగింది. లక్కీ మీడియా బ్రదర్ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సాంగ్ లంచ్ కి గాను ముఖ్య అతిథులుగా హీరో శివాజీ గారు, డైరెక్టర్ నక్కన త్రినాధరావు గారు, బెజావాడ ప్రసన్న కుమార్ గారు, తదితరులు పాల్గొన్నారు. సాంగ్ లాంచ్ చేసిన అనంతరం అతిధులు మరియు సినిమాకి పనిచేసినవారు, సినిమాలో నటించిన వారు మాట్లాడటం జరిగింది.
ఈ సందర్భంగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ నక్కిన త్రినాధరావు గారు మాట్లాడుతూ… “తమ్ముళ్ళూ” అంటూ తన స్పీచ్ మొదలు పెట్టారు. రోటి కపడ రొమాన్స్ అనే సినిమా టైటిల్ దగ్గరకు చాలా కాలం క్రితం వచ్చిందని, తనకి సినిమా స్టోరీ కూడా బాగా నచ్చిందని అన్నారు. అయితే ఈ సినిమా స్టోరీ వింటున్నప్పుడు డెక్కన్ వేణుగోపాల్ గారితో తన ఫ్రెండ్షిప్ గుర్తొచ్చిందని అన్నారు. వారిద్దరూ గోవాలోని ఓ బీచ్ లో ఆల్రెడీ సినిమా స్టోరీ గురించి కలిసి మాట్లాడుకున్న సన్నివేశాలు గుర్తొచ్చారని ఆ విషయాలని మీడియాతో పంచుకున్నారు. వాళ్ల యొక్క లవ్ స్టోరీ గురించి మాట్లాడుకుంటుండగా వాటిలోని పుట్టిన ఓ స్టోరీని సినిమాగా తీశామని ఆయన అన్నారు. తన స్నేహితుడు అయిన వేణుగోపాల్ గారు తనకోసం అక్కడక్కడ చిల్లర ఏరుకుని తనకు చికెన్ వండి పెట్టేవారని, అలాగే ఒక సినిమా తీయడంలో మాత్రం ఎంతైనా ఖర్చు పెట్టడానికి చెప్పారు.

అలాగే స్టేజి మీద ఒక హీరోయిన్ కూడా లేకపోవడం తనకు చాలా బాధాకరంగా ఉంది అని నవ్వుతూ అంటుండగానే సినిమాలో నటించిన ఓ హీరోయిన్ రావడంతో తిరిగి చాలా సంతోషం కలిగిందని త్రినాధ రావు గారు తెలిపారు. ఈ సినిమాకి పనిచేసిన వారంతా చాలా గొప్పగా పని చేశారని అలాగే ఈ సినిమా గొప్ప సక్సెస్ కావాలని త్రినాధ రావు గారు తెలిపారు.