‘లాస్ ఏంజిల్స్’‌లోని కొత్త ఇంటిపై ‘మమతా మోహన్‌దాస్’ వ్యామోహం!!

మమతా మోహన్‌దాస్ సౌత్ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి. రాజమౌళి యమదొంగ చిత్రంతో ఈ నటికి భారీ క్రేజ్ దక్కింది. ప్రస్తుతం ఆమె క్యాన్సర్‌తో పోరాడుతోంది. క్యాన్సర్ నిర్ధారణ అయినప్పుడు, ఆమె సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో మమతా ఇండియాలోనే ఉంది. కాని చికిత్స కోసం వందే భారత్ విమానాల సహాయంతో, ఆమె లాస్ ఏంజిల్ కి చేరుకుంది.

చాలా రోజుల తరువాత ఆమె తన ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశారు. 6 సంవత్సరాల చికిత్సను పూర్తి చేయడం గురించి వివరణ ఇస్తూ… “సుపరిచితమైన ఇంటి సౌలభ్యం నుండి పూర్తిగా తెలియని ఇంటికి వెళ్ళటానికి నా ప్రయాణం మొదలైంది. లోసాంజిల్స్‌ తో ఈ రోజుతో 6 సంవత్సరాలు పూర్తయ్యింది. నా ప్రాధమిక ఆంకాలజిస్టులు డాక్టర్ ది అపోలో హాస్పిటల్స్ / అడయార్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూడ్ మరియు డాక్టర్ జాన్ యూక్లా యొక్క టిమ్మెర్మాన్ నన్ను ఎప్పటికీ నిరాశపరచలేదు. నా తల్లిదండ్రులు నేర్పిన మంచితనంతో దేన్నైనా చేయగలనని ఇప్పుడు నమ్ముతున్నాను “అని వివరణ ఇచ్చింది.