‘జయప్రకాష్ రెడ్డి’ మృతిపై ‘మెగాస్టార్’ ఎమోషనల్ కామెంట్స్!!

సీనియర్ నటుడు శ్రీ జయప్రకాష్ రెడ్డి ఈ రోజు ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆయన మృతిపట్ల స్టార్స్ అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా ఈ విషాద ఘటనపై స్పందించారు. “ఆయన మృతి సినీమా ఇండస్ట్రీకి తీరని లోటు. జయప్రకాష్ రెడ్డి గారితో నేను ఆఖరి సారి చేసిన చిత్రం ఖైదీ నెంబర్ 150. ఆయన ఒక గొప్ప నటుడు. “నాటకరంగం నన్ను కన్నతల్లి.. సినిమా రంగం నన్ను పెంచిన తల్లి” అనేవారు.

అందుకే శని ఆదివారాల్లో షూటింగ్స్ పెట్టుకోకుండా స్టేజ్ మీద పెర్ఫామెన్స్ ఇస్తుంటాను.మిరెప్పుడైనా రావాలి” అని అడిగేవారు. ఆ అవకాశాన్ని నేను పొందలేకపోయాను. సినిమాల్లో రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ అంటే మొదట గుర్తుకు వచ్చేది జయప్రకాష్ రెడ్డి గారే. తనకంటూ ఒక ప్రత్యేకమైన ట్రెండ్ సృష్టించుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. అని మెగాస్టార్ ట్విట్టర్ లో వివరణ ఇచ్చారు.