బాలీవుడ్ లో మరో విషాదం

బాలీవుడ్‌లో ఇటీవల వరుస విషాద ఘటనలను మారువకముందే మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ ద‌ర్శ‌కుడు రాజ‌త్ ముఖ‌ర్జీ కూడా తుది శ్వాస విడిచారు. దీంతో బాలీవుడ్ లో సినీ ప్రముఖులు మరింత శోక సంద్రంలో మునిగారు. రిషి క‌పూర్‌, ఇర్ఫాన్ ఖాన్‌, జ‌గ‌దీప్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, స‌రోజ్ ఖాన్‌, వాజిద్ ఖాన్‌ వంటి సినీ ప్రముఖులు ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే.

ఇంకా ఆ ఘటనల గురించి మరువక ముందే మరో దర్శకుడు కన్నుమూశారు. ప్యార్ తునే క్యా కియా, ల‌వ్ ఇన్ నేపాల్‌ వంటి సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వహించిన రాజత్ బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జైపూర్‌లోని త‌న‌ ఇంట్లోనే చాలా రోజులుగా చికిత్స తీసుకుంటున్నారట. ఇక రాజత్ రీసెంట్ గా తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. బాలీవుడ్ సినీ ప్రముఖులు ప్రముఖులు రాజత్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.