పిచ్చెక్కిచ్చేద్దాం.. ప్రభాస్ అంటే ఆ మాత్రం ఉండాలి!

మహానటి వంటి క్లాసిక్ సినిమాతో నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ బాహుబలి ప్రభాస్ తో నెక్స్ట్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ దర్శకుడు ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు అనగానే పాన్ ఇండియా రేంజ్ ని అందుకోగలడా అనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి.

ఇక దీపికా పదుకొనె లాంటి అగ్ర తారను సెలెక్ట్ చేసుకున్నాడు అంటే ఎదో వండర్ క్రియేట్ చేయబోతున్నట్లు అర్ధమవుతోంది. దీపికాను సెలెక్ట్ చేసుకోవడంపై ట్వీట్ చేసిన నాగ్ అశ్విన్.. ‘కింగ్ కి సరిపోయేంత క్వీన్ కావాలి కదా మరి. చాలా ఆలోచించి తీసుకున్న డిసిషన్ ఇది. పిచ్చెక్కిచ్చేద్దాం’ అని వివరణ ఇచ్చాడు. దీంతో అభిమానులు నాగ్ అశ్విన్ స్పందించిన తీరుకు ఫిదా అవుతున్నారు. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా అశ్వినిదత్ భారీ బడ్జెట్ లో నిర్మించనున్నట్లు తెలుస్తోంది.