నిహారిక పెళ్లికి ఎంతమంది గెస్ట్స్ వస్తున్నారో తెలుసా?

మెగా డాటర్ నిహారిక పెళ్లి రేపు సాయంత్రం రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ఉదై ప్యాలెస్‌ హోుటల్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. గుంటూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జోన్నలగడ్డ చైతన్యతో నిహారిక మూడు ముళ్లు వేయించుకోనుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో సహా మెగా ఫ్యామిలీ మొత్తం హాజరుకానుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీకి చెందిన పలువురు కుటుంటసభ్యులు వారం రోజుల క్రితమే అక్కడికి చేరుకుని సందడి చేస్తున్నారు. పెళ్లి ఏర్పాట్లు చూసుకుంటూ అక్కడే ఉన్నారు.

NIHARIKA

ఇక ఈ పెళ్లి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. మొత్తం 120 మంది అతిథులను ఈ వివాహానికి ఆహ్వానించినట్లు సమాచారం. వీరిలో నిహారిక,చైతన్యల ఫ్రెండ్స్, సన్నిహితులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినీ పరిశ్రమకు చెందని ప్రముఖులు కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, అగ్రహీరోలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే లావణ్య త్రిపాఠి, రితువర్మ ఉదయ్ పూర్ చేరుకున్నారు.

అతిధులకు పట్టువస్త్రాలు బహుకరించడమే కాకుండా ఖరీదైన సూట్లలో వసతి కల్పించినట్లు సమాచారం. ఇప్పటికే చిరంజీవి, రాంచరణ్,బన్నీ, అల్లు అరవింద్ ప్లైట్‌లో ఉదయ్‌పూర్ చేరుకున్నారు. ఇప్పటికే వెన్యూ దగ్గర సంగీత్ వేడుకలు అట్టహసంగా జరగ్గా.. నిహారిక-చైతన్య కలిసి డ్యాన్స్ వేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.