నేడు ఆర్మీ డే.. జ‌వాన్ల‌తో వాలీబాల్‌ ఆడిన అక్ష‌య్‌!

నేడు ఆర్మీడే సంద‌ర్భంగా బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అక్ష‌య్‌కుమార్ జ‌వాన్ల‌తో సంద‌డి చేశారు. ప్ర‌స్తుతం అక్ష‌య్ తాజా చిత్రం బ‌చ్చ‌న్ పాండే. ఈ సినిమా రాజ‌స్థాన్‌లోని జైస‌ల్మీర్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఆర్మీడే సంద‌ర్భంగా ఉద‌యాన్నే జ‌వాన్ల‌తో క‌లిసి వాలీబాల్ గేమ్ ఆడాడు. అక్ష‌య్‌కుమార్ బ్లాక్ డ్రెస్‌లో గేమ్ ఆడ‌గా.. జ‌వాన్ల్ కూడా బ్లాక్ డ్రెస్ వేసుకుని.. తీవ్ర చ‌లిలో వాలీబాల్ ఆడారు. ఈ విష‌యాన్ని తానే స్వ‌యంగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు అక్ష‌య్‌.

bachanpande akshaykumar

తాము షూటింగ్ బిజీగా ఉన్న స‌మ‌యంలో నేడు ఆర్మీడే అని తెలిసి జ‌వాన్ల‌తో జాయిన్ అయ్యి, వాళ్ల‌తో‌ తీవ్ర‌మైన చ‌లిలో వాలీబాల్ ఆడ‌డం ఎంతో ఎంజాయ్‌మెంట్ అనిపించింద‌ని అన్నారు. ఇలా ధైర్య‌వంతులైన జ‌వాన్ల‌ను క‌ల‌వ‌డం.. ఆర్మీ డే సంద‌ర్భంగా జ‌వాన్ల‌తో క‌లిసి మార‌థాన్ ప్రారంభించ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని అక్ష‌య్ పేర్కొన్నారు. అక్ష‌య్‌తో పాటు బ‌చ్చ‌న్‌పాండే చిత్ర హీరోయిన్ కృతిస‌న‌న్ కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంది. ఇక ఈచిత్రాన్ని ఫ‌ర్హ‌ద్ సామ్‌జీ ద‌ర్శ‌క‌త్వంలో సాజిద్ న‌దియావాలా నిర్మిస్తున్నారు.