మూడో పెళ్లి గోల.. మరోసారి పోలీస్ స్టేషన్ కి వెళ్లిన వనిత

దేవి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వనిత విజయ్ కుమార్ చాలా కాలం తరువాత ఉహీంచని కాంట్రవర్సీలతో మళ్ళీ తెలుగు జనాలను ఆకర్షించింది. రియల్ లైఫ్ ఫ్యామిలీ సస్పెన్స్ డ్రామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఇదివరకే రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఈ సీనియర్ హీరోయిన్ కి ముగ్గురు పిల్లలున్న విషయం తెలిసిందే.

ఇక ఇటీవల పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకున్న వనిత సంతోషంగా కొత్త కాపురానికి వెళ్లిన మరుసటి రోజే కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి ఎలా చేసుకుంటారు అని పీటర్ పాల్ మాజీ భార్య కోర్టును ఆశ్రయించడంతో అందరి జీవితాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక కొంతమంది సినీ యాక్టర్స్ వనితా మూడో పెళ్లిపై కూడా విమర్శలు చేశారు.

ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వనిత నెగిటివ్ కామెంట్స్ చేసిన సెలబ్రెటీస్ పై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఆ లిస్ట్ లో ప్రముఖ నటి, డైరెక్టర్ అయిన లక్ష్మీ రామకృష్ణన్‌, కస్తూరి, నిర్మాత రవీంద్రన్‌లు ఉన్నారు. తన వ్యక్తిగత జీవితంపై తప్పుగా కామెంట్ చేసే హక్కు వీళ్లకు ఎవరు ఇచ్చారు అంటూ.. వారు చేసిన కామెంట్స్ తనను ఎంతగానో బాధించాయని వనిత విజయ్ కుమార్ వివరణ ఇచ్చారు.