విక్టరీ వెంకటేష్ నెక్స్ట్ సినిమా ఎవరితో అంటే….?

విక్టరీ వెంకటేష్ చివరిసారిగా తన 75వ చిత్రం సైందవలో కనిపించారు. ఈ సినిమాపై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ ఆ అంచనాలను అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు విక్టరీ వెంకటేష్ తనకు బలం అయిన ఎంటర్‌టైన్‌మెంట్ జోనర్‌కి తిరిగి వస్తున్నాడని తెలిసింది.

ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. దర్శకుడు అనిల్ రావిపూడితో వెంకటేష్ మరో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఎఫ్2, ఎఫ్3 సినిమాలతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఈ కాంబినేషన్ మళ్లీ కలవబోతోంది.

గ్రామీణ వాతావరణంలో ఈ సినిమా ఉండబోతోందని అంటున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నాడని సమాచారం. అలాగే ఈ సినిమా 2025 సంక్రాంతికి బరిలో ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి.