రామ్ చరణ్ కోసం ఈ ఫ్యాన్ ఏం చేశాడో తెలుసా?

అభిమాన హీరోల కోసం ఫ్యాన్స్ ఒకప్పుడు పెద్ద పెద్ద కటవుట్స్ పెట్టే వాళ్లు, పాలాభిషేకాలు చేసే వాళ్లు… ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండ్స్ క్రియేట్ చేస్తున్నారు. అయితే కొంతమంది అభిమానులు మాత్రం తమ ఫ్యావరేట్ హీరోలని కలవడానికి ఈ మధ్య పాదయాత్రలు చేస్తున్నారు. ఎంత దూరం ఉన్నా నడుచుకుంటూ వచ్చి మరి తమ ఆరాధ్య హీరోలని కలుస్తున్నారు. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ షూటింగ్ లో బిజీ గా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ తేజ్ కోసం కూడా తన ఫ్యాన్స్ ఇలాంటి పనే చేశాడు. రామ్ చరణ్ ని కలవడానికి ముగ్గురు అభిమానులు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 231 కిలోమీటర్లు నడిచి చరణ్‌ను కలిశారు.

అలంపూర్‌ జోగులాంబకు చెందిన సంధ్య జయరాజ్‌, రవి, వీరేశ్‌.. తమ అభిమాన హీరో రామ్‌చరణ్‌ను కలవాలనుకున్నారు. అందుకోసం జోగులాంబ జిల్లా నుంచి 4 రోజుల క్రితం హైదరాబాద్‌కు నడక మొదలుపెట్టారు. 231 కిలో మీటర్లు నడిచి శుక్రవారం మధ్యాహ్నాం రామ్‌ చరణ్‌ను కలిశారు. వారిని చూసిన రామ్‌చరణ్‌ ఫిదా అయిపోయారు. వారిని ఆత్మీయ ఆలింగనం చేసుకుని కాసేపు వారితో ముచ్చటించారు. అనంతరం సెల్ఫీ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడయాలో వైరల్‌ అవుతున్నాయి.