సౌత్ మార్కెట్ టార్గెట్ చేసిన శర్వా…

రీసెంట్ గా శ్రీకారం లాంటి మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేసిన యంగ్ హీరో శర్వానంద్ ఆశించిన మేరకు హిట్ ఇవ్వలేకపోయాడు. శ్రీకారం మంచి కంటెంట్ అనే పేరు అయితే తెచ్చుకుంది కానీ కమర్షియల్ గా డబ్బులు రాబట్టలేక పోయింది. ఈ రిజల్ట్ ని మర్చిపోయే రేంజులో శర్వానంద్ మహా సముద్రం మూవీ చేస్తున్నాడు. ఆర్.ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఒకప్పటి లవర్ బాయ్ సిద్దార్థ్ నెగటివ్ లీడ్ ప్లే చేస్తున్నాడు. దాదాపు షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తర్వాత శర్వానంద్ సౌత్ మార్కెట్ పై కన్నేశాడు.

సిద్దార్థ్ కి కోలీవుడ్ లో ఉన్న ఇమేజ్ కారణంగా అక్కడ కూడా మహాసముద్రం సినిమాని రిలీజ్ చేస్తుండడం మార్కెట్ పెంచుకోవడానికి శర్వానంద్ కి కలిసొచ్చే అంశం. ఈ మహాసముద్రం ఇస్తున్న బూస్ట్ తో శర్వానంద్… తన నెక్స్ట్ సినిమాని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో చేస్తున్నాడు. కోలీవుడ్ బడా బ్యానర్స్ లో ఒకటైన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ గతంలో సూర్య అండ్ కార్తిలతో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూ హిట్స్ ఇస్తుంది. ఇలాంటి సంస్థతో శర్వ తన 30వ సినిమా చేస్తున్నాడు. శ్రీ కార్తీక్ అనే డెబ్యు డైరెక్టర్ ఈ బైలింగ్వల్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ #Sharwa30 ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ ని 28 జూన్ సాయంత్రం 5 గంటలకి రిలీజ్ చేయనున్నారు. 2009లో మొదటి తమిళ్ సినిమా చేసిన శర్వా ఇప్పటివరకూ అయిదు చిత్రాలని కోలీవుడ్ లో చేశాడు. ఇందులో ఎంగేయుమ్ ఎప్పోదుం మూవీకి బెస్ట్ డెబ్యు హీరో అవార్డు కూడా అందుకున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్స్ ఏవీ శర్వానంద్ మార్కెట్ ని పెంచలేదు. రితూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ మూవీ అయినా శర్వా మార్కెట్ ని పెంచుతుందేమో చూడాలి.