Janasena: పింగ‌ళి వెంక‌య్య‌కు భార‌త‌ర‌త్న ఇవ్వాలి: జ‌న‌సేనాని

Janasena: భార‌త్ జాతీయ ప‌తాక రూప‌శిల్పి పింగ‌ళి వెంక‌య్య‌కు భార‌త‌రత్న ప్ర‌క‌టించాల‌ని జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ డిమాండ్ చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో ప్ర‌తి ఒక్క‌రిలో స్ఫూర్తి ర‌గిలించింది మువ్వ‌న్నెల జెండా అని.. మ‌న దేశ ఔన్న‌త్యానికి, స‌మ‌ర‌వీరుల త్యాగ‌ఫ‌లానికి స‌గ‌ర్వ సంకేతంగా నిలుస్తుంద‌ని పేర్కొన్నారు.

National flog

జాతీయ ప‌తాకం రెప‌రెప‌లు మొద‌లై నేటితో 100 సంవ‌త్స‌రాలు పూర్త‌యింద‌ని.. ఈ విష‌యంపై భార‌తీయులంద‌రూ గ‌ర్వ‌ప‌డాల్సిన మ‌ధుర క్ష‌ణాల‌ని అన్నారు. దీనికి కార‌ణ‌మైన మ‌హోన్న‌త వ్య‌క్తి పింగ‌ళి వెంక‌య్య‌కు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని.. ఊరూరా విగ్ర‌హాలు ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న సూచించారు.