Tollywood: జాతిర‌త్నాలు వీక్షించిన సూప‌ర్‌స్టార్ కృష్ణ‌..

Tollywood: న‌వీన్ పోలీశెట్టి, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన జాతిర‌త్నాలు చిత్రం.. మార్చి 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ అయి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది.. బాక్సాఫీస్ వ‌ద్ద ఓ రేంజ్‌లో క‌లెక్ష‌న్ల సునామీ కురిపిస్తుంది.. ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌లో న‌వ్వులు వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాపై సినీ ప్ర‌ముఖులు ప్ర‌త్యేకంగా వీక్షించి..మూవీ టీంకు అభినంద‌న‌లు తెలుపుతున్నారు. ఇటీవ‌లే స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఈ చిత్రం వీక్షించి.. చిత్ర‌బృందానికి అభినంద‌న‌లు తెలిపిన విష‌యం తెలిసిందే. ఇక తాజాగా సూప‌ర్‌స్టార్ కృష్ణ జాతిర‌త్నాలు చిత్రాన్ని వీక్షించారు. ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ న‌టుడు న‌రేశ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపారు.

Jaathirathnalu

ఆయ‌న‌తో క‌లిసి ఫుల్‌టైమ్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ వీక్షించ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని.. సూప‌ర్‌స్టార్‌తో క‌లిసి జాతిర‌త్నాలు వీక్షించాను.. అంటూ పోస్ట్ చేశారు న‌రేశ్‌.. అలాగే ఈ సంద‌ర్భంగా క‌థానాయ‌కుడు న‌వీన్ పోలిశెట్టి, డైరెక్ట‌ర్ అనుదీప్‌, నిర్మాత నాగ్ అశ్విన్ తో పాటు స్వ‌ప్నా సినిమాస్ టీమ్ మొత్తానికి నా హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు అంటూ న‌రేశ్ పేర్కొన్నాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ ఫ‌రియా అబ్దుల్లా తండ్రి పాత్ర‌లో న‌రేశ్ న‌టించిన విష‌యం తెలిసిందే.