Thamilnadu: ప్రముఖ నటుడు కమల్హాసన్ ఎంఎన్ఎం అనే రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో దక్షిణ కోయంబత్తూరులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేస్తుండగా.. అభిమానులు ఒక్కసారిగా ఆయనమీదకు తోసుకొచ్చారు.
![Kamal](https://telugu.tfpc.in/wp-content/uploads/2021/03/kamal-hassan.gif)
తొక్కిసలాటలో కమల్ మీద పడ్డారు. ఆయన కాలిని తొక్కేశారు.. ఈ ఘటనలో కమల్ కాలికి గాయమైంది.. కాలి నొప్పి తీవ్రం కావడంతో ప్రచారాన్ని ఆయన ఆపేశారు. దీంతో కొన్ని రోజుల పాటు ప్రచారానికి దూరం ఉండాలని వైద్యులు ఆయనకు సూచించారు. ఇక కమల్ దక్షిణ కోయంబత్తూరు స్థానం నుంచి కమల్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.