Tollywood: ప‌వ‌ర్‌స్టార్ రిలీజ్ చేసిన శ‌శి ట్రైల‌ర్‌..

Tollywood: టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం శ‌శి. ఈ చిత్రానికి శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఆర్‌పి వ‌ర్మ‌, సి. రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ Tollywood చిత్రంకు సంబంధించి ఇప్ప‌టికే పోస్ట‌ర్ల్‌, టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంది. ఇందులో ఆది వైవిధ్యమైన పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడు.

shashi trailer

ఈ చిత్రాన్ని మార్చి 19న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న నేప‌థ్యంలో ఈ చిత్రంకు సంబంధించి ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఈ మేర‌కు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్ ఈTollywood చిత్ర ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయ‌డం జ‌రిగింది. ఇదివ‌ర‌కు ఈ చిత్ర టీజ‌ర్, ఒక సాంగ్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా చిత్ర‌బృందం రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైల‌ర్‌లో.. మ‌నం ప్రేమించే వాళ్లు మ‌న ప‌క్క‌న ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో.. ప్ర‌మాదంలో ఉన్న‌ప్పుడు అంతే భ‌యంగా ఉంటుంది. అని ఆది చెప్పే డైలాగ్‌తో ప్రారంభ‌మ‌వ‌గా.. ఎంతో అల‌రిస్తోంది. ఇక ఈ చిత్రంలో ఆది స‌ర‌స‌న సుర‌భి హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే రాశీసింగ్‌, రాజీవ్ క‌న‌కాల‌, వెన్నెల కిషోర్‌, తులసి, అజ‌య్ త‌దిత‌రులు న‌టించినTollywood చిత్రానికి అరుళ్ చిలువేరు సంగీతం అందిస్తున్నారు.