జనవరి నుంచి స్టార్ట్ చేయనున్న మహేష్‌బాబు

పరశురామ్ డైరెక్షన్‌లో వస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తున్నాడు. లాక్‌డౌన్ వల్ల ఆగిపోయిన దీని షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ ప్రారంభించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. జనవరి నుంచి రెండు నెలల పాటు యూఎస్‌లో షూటింగ్ చేయనున్నారని సమాచారం.

maheshbabu

ప్రస్తుతం పేపర్ వర్క్‌ను సినిమా యూనిట్ పూర్తి చేయగా.. వీసాలు ఓకే అయితే యూఎస్ జనవరిలో యూఎస్ వెళ్లనున్నారు. అమెరికాలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో సినిమా యూనిట్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కరోనా క్రమంలో వసతి ఎక్కడ ఏర్పాటు చేయాలి? అనే అంశాన్ని నిర్మాతలు పరిశీలిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇప్పటికే విడుదలైన ‘సర్కారు వారి పాట’ ఫస్ట్‌లుక్‌లు సినిమాపై అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి.