‘సుశాంత్’ నుంచి విడిపోవడానికి కారణమేంటి? ప్రశ్నలతో ‘రియా’కు షాక్ ఇచ్చిన సీబీఐ!!

దేశవ్యాప్తంగా సంచలన సృష్టిస్తున్న సుశాంత్ సింగ్ రాజ్ సింగ్ కేసు ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు. గత రెండున్నర నెలలుగా విచారణలు జరుగుతూనే ఉన్నాయి గాని కొంత కూడా నిజాలు బయటకు రావడం లేదు. ఇక కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లినప్పుటి నుంచి కూడా ఎక్కువగా రియాకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఇక ఆమెను ప్రశ్నించిన విధానంపై రోజుకో న్యూస్ వైరల్ అవుతోంది.

రియా చక్రవర్తిని సీబీఐ అధికారులు వరుసగా నాలుగు రోజుల పాటు విచారించారు. ఇక ఆమె సమాధానాలతో సిబిఐ సంతృప్తి చెందలేదని కూడా తెలుస్తోంది. సోమవారం విచారణలో వారు విడిపోవడం గురించి ఎక్కువగా అడిగినట్లు సమాచారం. IANS కథనం ప్రకారం, వారి గొడవ గురించి కూడా సిబిఐ రియా చక్రవర్తిని ప్రశ్నించింది. అలాగే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను ఎందుకు విడిచిపెట్టింది? ప్రియుడి మరణం గురించి ఆమె ఎలా తెలుసుకుందని అడిగారు. అసలు ఆమెను ఎవరు పిలిచారు? మరియు ఏ సమయంలో? జూన్ 8 న వారు నిజంగా విడిపోయారా అని కూడా సిబిఐ అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.