మలయాళంలోకి ఎంట్రీ ఇస్తున్న పూజాహెగ్దే

‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్.. ఆ తర్వాత ‘కనులు కనులు దోచాయంటే’ సినిమాలో నటించాడు. అయితే ‘కనులు కనులు దోచాయంటే’ సినిమా ప్లాప్ కావడంతో హీరోగా అతడికి అవకాశాలు రాలేదు. అయితే ఇప్పుడు తెలుగులో మరో సినిమాతో అతడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఒక సినిమా చేసేందుకు అతడు ఓకే చెప్పగా.. ఇందులో మిలటరీ వ్యక్తిగా దుల్కర్ సల్మాల్ కనిపించనున్నాడు. మిలటరీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్పాదత్ ఈ సినిమా నిర్మిస్తున్నాడు. తెలుగుతో పాటు మలయాళంలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

PUJA HEGDE

త్వరలో ఆ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముంది. తాజాగా ఇందులో దుల్కర్ సల్మాన్ పక్కన హీరోయిన్ ఎవరనేది క్లారిటీ వచ్చింది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. తెలుగుతో పాటు తమిళంలో టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న పూజాహెగ్దే.. ఈ సినిమాతో మాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతోంది.

దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుండగా.. దీనికి కోసం పూజాహెగ్దే రూ.రెండున్నర కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునుందని సమాచారం. మరి మలయాళంలో పూజాహెగ్దే సక్సెస్ అవుతుందా?.. లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కొద్దిరోజుల్లో స్టార్ హీరోయిన్‌గా పూజాహెగ్దే పేరు తెచ్చుకుంది. స్టార్ హీరోల అందరి సరసన సినిమాలు చేసిన టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.