మహేష్ బాబు కోసం బ్యాంక్ రెడీ

సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్‌లో ‘సర్కారువారి పాట’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్ బాగుండటంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను అందుకుని మహేష్ బాబు జోష్‌లో ఉన్నాడు. సర్కారువారి పాట సినిమాతో మరో హిట్‌ను అందుకోవాలనే ఉత్సాహంతో మహేష్ ఉన్నాడు. లాక్‌డౌన్ వల్ల ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

MAHESHBABU

ఈ సినిమాలో మహేష్ బాబు బ్యాంక్ ఉద్యోగి పాత్రలో కనిపిస్తుండగా.. దీని కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఒక బ్యాంక్ సెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ సెట్‌లో నెల రోజుల పాట షూటింగ్ జరగనుందని, ఈ షూటింగ్‌లో మహేష్ బాబు త్వరలో పాల్గొననున్నారని తెలుస్తోంది. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముంది. ముందు అమెరికా షెడ్యూల్ ప్లాన్ చేసి, ఆ తర్వాత ఇక్కడ షెడ్యూల్ ప్రారంభించానలి ముందుగా మేకర్స్ అనుకున్నారు.

కానీ కరోనా వల్ల అమెరికా షెడ్యూల్ క్యాన్సిల్ కావడంతో.. ముందుగా ఇక్కడ షూటింగ్ జరగపనున్నారు. ఇక్కడ నెల రోజుల పాటు షూటింగ్ ముగిసిన తర్వాత అమెరికా షెడ్యూల్ ప్రారంభం కానుంది. పరశురామ్ డైరెక్షన్‌లో సర్కారువారి పాట సినిమా తెరకెక్కుతుండగా. . మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లాస్, జీయంబీ సంస్థలు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.