‘శశివదనే’ నైజాంలో విడుదల తేది చెప్పిన మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్

పలాస సినిమాతో ప్రసిద్ధి చెందిన రక్షిత్ అట్లూరి తో కలిసి కోమలి హీరోయిన్ గా నటిస్తూ మన ముందుకు వస్తున్న సినిమా శశివదనే. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తు, గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వ‌హించారు.

ఈ చిత్రం నుండి వచ్చిన టీజర్ & సాంగ్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా నైజాం ఏరియా పంపిణీ హక్కులను ప్రముఖ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పి సంస్థ దక్కించుకుంది. శరవణన్ వాసుదేవన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. శ్రీసాయికుమార్ దారా సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా గ్యారీ బి.హెచ్ వర్క్ చేస్తున్నారు.

ఏప్రిల్ 19న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.