ఏప్రిల్ 19 నుంచి ఆహాలో ‘మై డియ‌ర్ దొంగ‌’ ప్రీమియ‌ర్స్

అల్టిమెట్ కామెడీ ఎంటర్టైనర్ ‘మై డియర్ దొంగ’ ప్రీమియర్ ను ఆహా స్ట్రీమింగ్ తేదీ అనౌన్స్ చేసింది. ఈ నెల 19 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది అని ఆహా తెలిపింది. ఈ వార్త సినీ లవర్స్ కి సంతోషం కలిగించింది. షాలిని కొండేపూడి రచించిన ఈ సినిమాకి బి.ఎస్‌.స‌ర్వ‌జ్ఞ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అభిన‌వ్ గోమ‌టం, షాలిని కొండేపూడి, దివ్య శ్రీపాద కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ఈ సినిమా.
ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అల్టిమేట్ లాఫ‌ర్ థెర‌పీ అందివ్వ‌డానికి తుది మెరుగులు దిద్దుకుంటోంది మై డియ‌ర్ దొంగ‌.