షూటింగ్‌ మధ్యలో కుప్పకూలిపోయిన స్టార్ నటుడు.. టెన్షన్‌లో సినీ పరిశ్రమ

బాలీవుడ్‌ స్టార్ నటుడు మిథున్ చక్రవర్తి అనారోగ్యానికి గురికావడం ఇప్పుడు అభిమానులను కలవరపరుస్తోంది. షూటింగ్ మధ్యలోనే కుప్పకూలి కింద పడిపోయిన ఆయనను చూసి సినిమా యూనిట్ షాక్‌కు గురైంది. ప్రస్తుతం వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమాలో ప్రస్తుతం మిథున్ చక్రవర్తి నటిస్తున్నారు. ప్రస్తుతం ముస్సోరీలో దీని షూటింగ్ జరుగుతుండగా.. ఈ షూటింగ్‌లో తాజాగా మిథున్ చక్రవర్తి పాల్గొన్నారు. షూటింగ్ చేస్తున్న సమయంలోనే మధ్యలో అనారోగ్యంతో ఆయన కుప్పకూలి పడిపోయారు.

MIDHUN CHAKRAVARTHY

దీంతో వెంటనే షూటింగ్ మధ్యలోనే ఆపివేశారు. కాసేపు రెస్ట్ తీసుకున్న మిథున్ చక్రవర్తి.. ఆ తర్వాత తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నారు. ఫుడ్ పాయిజనింగ్ కావడం వల్ల కడుపు నొప్పితో ఆయన ఇలా కుప్పకూలి పడిపోయినట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. ఫుడ్ పాయిజనింగ్ కావడం వల్ల కళ్లు తిరిగి కింద పడిపోయారని సినిమా యూనిట్ కూడా తెలిపింది.

సాధారణంగా ఒక వ్యక్తి కూడా ఆ పరిస్థితుల్లో కనీసం నిల్చోలేరని, కానీ మిథున్ కొద్దిసేపు రెస్ట్ తీసుకుని తిరిగి షూటింగ్ ప్రారంభించారని డైరెక్టర్ వివేక్ చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన షూటింగ్ చేస్తారని తాను అనుకోలేదని, అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యాడని డైరెక్టర్ అన్నారు.