ఆచార్యపై క్లారిటీ వచ్చేసింది.. సమ్మర్ లోనే రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ని అందించింది కొణిదెల ప్రొడక్షన్ హౌజ్. ఈ సినిమాకు సంబంధించిన తదుపరి షెడ్యూల్ ని నవంబర్ 9న స్టార్ట్ చేయనున్నారు. అందుకు సంబంధించిన న్యూస్ కూడా వైరల్ అవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కరోనా కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే.

అయితే ఎలాగైనా ఆ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మెగాస్టార్ కూడా డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. అందుకే ఈ నెలలోనే షూటింగ్ స్టార్ట్ చేసి సమ్మర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని అనుకుంటున్నారు. మొదట ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ బ్యాలెన్స్ షూటింగ్ చాలా ఉండడం వలన ఎంత వేగంగా వర్క్ చేసినా కూడా వర్కౌట్ అయ్యేలా లేదు. ఇక కరోనా కారణంగా భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.