మహేష్, రామ్ చరణ్ కాంబో లేనట్లే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు, రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా రానుందని గత కొన్నీ వారాలుగా అనేక రకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒక ప్రాజెక్ట్ కోసం కలవబోతున్నారు అనే టాక్ అభిమానుల్లో అంచనాల డోస్ ని పెంచింది. మహేష్ బాబు నిర్మాతగా రామ్ చరణ్ హీరోగా సినిమా రానున్నట్లు వస్తున్న కథనాలు ఆల్ మోస్ట్ నిజమనుకున్న సమయంలో అందులో ఎలాంటి నిజం లేదని ఒక క్లారిటీ వచ్చింది.

మహేష్ బాబు ఆ ప్రాజెక్టు నుంచి పూర్తిగా తప్పుకున్నట్ల తెలుస్తోంది. మహర్షి సినిమా అనంతరం వంశీ పైడిపల్లితో మరో సినిమా చేయాలని అనుకున్న మహేష్ బాబు ఎందుకో కథ నచ్చక రిజెక్ట్ చేశాడు. కొన్ని మార్పులు కూడా కోరినట్లు టాక్.
అనంతరం రామ్ చరణ్ కి అదే కథని వినిపించగా వంశీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే ఆ సినిమాను మహేష్ బాబు నిర్మించే ఛాన్స్ ఉన్నట్లు టాక్ రాగా ఇప్పుడు దిల్ రాజు చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కొణిదెల ప్రొడక్షన్ లో రామ్ చరణ్ తో పాటు దిల్ రాజు ఈ ప్రాజెక్టుని సంయుక్తంగా నిర్మించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.