రాజమౌళి సినిమా కంటే ముందే మహేష్ మరో ప్లాన్

మహేష్ బాబు, ఎస్ఎస్.రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రానుందనే న్యూస్ వచ్చినప్పుటి నుంచి అభిమానుల్లో అంచనాల డోస్ తారా స్థాయికి చేరుకున్నాయి. అయితే RRR సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండడం వలన వారి కాంబో సెట్స్ పైకి రావడానికి మరింత ఆలస్యం అయ్యేలా ఉందనే టాక్ వస్తోంది. నెక్స్ట్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేయనున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ లో పరిస్థితులను బట్టి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. పరశురామ్ సినిమా అయిపోగానే రాజమౌళి సినిమాతో చేయాలని అనుకున్న మహేష్ ఇప్పుడు ప్లాన్ చేంజ్ చేసినట్లు తెలుస్తోంది. రాజమౌళి RRR ఆలస్యం కానుంది కాబట్టి మధ్యలో మహేష్ మరో సినిమా చేయనున్నాడట. సరిలేరు నికేవ్వరు సమయంలోనే అనిల్ రావిపూడితో ఒక సినిమా చేయాలని అనుకున్న మహేష్ మూడు నాలుగు నెలల్లో ఫినిష్ అయ్యే విధంగా ఒక సినిమాను ప్లాన్ చేయనున్నట్లు సమాచారం. అదే విధంగా ఒక తమిళ్ దర్శకుడితో కూడా సూపర్ స్టార్ కథ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.