కత్తి మహేష్ ని అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు

సినీ క్రిటిక్ గా పిలువబడే కత్తి మహేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కత్తి మహేష్ విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘రాముడు కరోనా ప్రియుడు సుమీ’ అని మహేష్ ఇటీవల కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వెలువడ్డాయి.

రాముడిపై అనుచిత వాక్యాలు చేయడం వలన హిందు మతాల మనోభావాలకు భంగం కలిగించేలా ఉన్నాయని కత్తి మహేష్ ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కొద్దీ సేపటి క్రితమే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో కత్తి మహేష్ పలు అభ్యంతర వ్యాఖ్యలు చేసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన విషయం తెలిసిందే. ఇక అయోధ్య రామ మందిర నిర్మాణ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర వివాదాలకు దారి తీసే అవకాశం ఉందని పోలీసులు కత్తి మహేష్ ని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంలో మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.