కేబుల్ రాజు గుర్తొచ్చాడు బాలరాజు

RX100 సినిమాతో హిట్ కొట్టి యూత్ కి దెగ్గరైన హీరో కార్తికేయ గుమ్మికొండ. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్న కార్తికేయ, గీత ఆర్ట్స్ లాంటి స్టార్ బ్యానర్ లో సావు కబురు చల్లగా సినిమా చేస్తున్నాడు. బస్తీ బాలరాజు పాత్రలో కనిపించనున్న కార్తికేయ, తన పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టీజర్ ని బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చాడు. కౌశిక్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో వైకుంఠ రథ సారథిగా కనిపించిన కార్తికేయ, తన లుక్ అండ్ డైలాగ్ డెలివరితో ఆకట్టుకున్నాడు. సీరియస్ మూవీస్ ఎక్కువగా చేసిన కార్తికేయ, బస్తీ బాలరాజు గొంతులో చిన్న ఎటకారం వినిపించింది. క్యారెక్టర్ కి తగ్గట్లు మార్చుకున్న కార్తికేయని చూస్తుంటే… వేదం సినిమాలోని కేబుల్ రాజు పాత్రలో చేసిన అల్లు అర్జున్ కనిపిస్తున్నాడు. ఈ సావు కబురు చల్లగా సినిమా కార్తికేయలోని పర్ఫెక్ట్ యాక్టర్ కి ప్రపంచానికి పరిచయం చేస్తుంది అనడంలో సందేహం లేదు. కార్తికేయకి అమ్మగా ఆమని నటిస్తున్న ఈ మూవీలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది.

కార్తికేయ తన బర్త్ డని మరింత స్పెషల్ గా మార్చుకుంటూ తన నెక్స్ట్ సినిమాని కూడా అనౌన్స్ చేశాడు. శ్రీ సారిపల్లి అనే కొత్త దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ స్నిక్ పీక్ ని రిలీజ్ చేసిన కార్తికేయ, మూవీ చాలా కొత్తగా ఉండబోతుందని ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. KG7 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో కార్తికేయ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని అర్ధం అవుతుంది.