Tollywood: జాతిర‌త్నాలు జోగిపేట టు అమెరికా ట్రిప్‌..

Tollywood: న‌వీన్ పోలిశెట్టి, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర‌లుగా తెర‌కెక్కిన చిత్రం జాతిర‌త్నాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఎంతో ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. దీంతో వీరికి టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎంతో గుర్తింపు తీసుకుచ్చింది. అలాగే ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అనుదీప్‌కు భారీ ఆఫ‌ర్ల్ వ‌స్తున్నాయి.

Jaathirathalu team

ఈ Tollywood సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశి గ‌డ్డ‌పై కూడా భారీ వ‌సూళ్ల‌ను రాబ‌డుతుంది. కాగా ఈTollywood చిత్రం అమెరికాలో భారీ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టుకుంటున్న సంద‌ర్భంగా.. జాతిర‌త్నాలు జోగిపేట టు అమెరికా కు వెళ్తున్నారు. ఈ విష‌యాన్ని ఇటీవ‌లే జ‌రిగిన స‌క్సెస్ మీట్‌లో నవీన్ పోలిశెట్టి వెల్ల‌డించారు.