గోవా షూటింగ్ ని ముగించుకున్న దీపికా.. చార్టర్డ్ ఫ్లైట్ లో ముంబైకి పయనం..

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన మాదకద్రవ్యాల కేసు విషయంలో సమన్లు అందుకున్న దీపిక పదుకొనె గురువారం గోవా నుంచి ముంబై బయలుదేరింది.
సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండేతో కలిసి షూటింగ్ కోసం గోవాకు వెళ్లిన దీపిక అక్కడ వర్క్ ను ముగించుకొని ఉత్తర గోవాలోని సిన్క్వేరిమ్ బీచ్ గ్రామంలోని తన ఫైవ్ స్టార్ రిసార్ట్ నుండి దాబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయంకు బయలుదేరింది.

అక్కడ నుండి ఆమె ప్రత్యేక చార్టర్డ్ విమానంలో ముంబైకి వెళ్లింది. ముంబైకి బయలుదేరే ముందు, దీపిక రిసార్ట్‌లో తన న్యాయ బృందం సభ్యులను కూడా కలిసినట్లు సమాచారం. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో ఆమె టాలెంట్ మేనేజర్ కరిష్మా ప్రకాష్ మధ్య 2017లోని వాట్సాప్ సందేశం లీక్ అయ్యింది. అందులో వీరు నిషేధిత పదార్థాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. సుశాంత్ దర్యాప్తులో జయా సహాను అన్ని ఫెడరల్ ఏజెన్సీలు ప్రశ్నించాయి. ముంబైలోని ఎన్‌సిబి అధికారుయూ ఇటీవల విచారణకు హాజరుకావాలని అధికారికంగా నోటీసులు జారీ చేశారు.