బాలయ్య తర్వాతి సినిమా ఆ డైరెక్టర్‌తోనే

ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలకృష్ణ ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలయ్య ఎవరితో సినిమా చేస్తాడనే దానిపై అనేక గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బి.గోపాల్,శ్రీవాస్, పూరీ జగన్నాథ్‌లు బాలయ్యకు కథ చెప్పినట్లు తెలుస్తోంది. వారందరు చెప్పిన కథలు బాలయ్యకు నచ్చడంతో వారితో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. అయితే బోయపాటి సినిమా తర్వాత ఎవరితో సినిమా చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

balayya

బి.గోపాల్‌తో సినిమా తర్వాత శ్రీవాస్‌తో బాలయ్య సినిమా చేసే అవకాశం ఉంది. మరోవైపు బాలయ్యతో మరో సినిమా చేసేందుకు పూరీ జగన్నాథ్ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పైసా వసూల్’ సినిమా యూత్‌ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో బాలయ్య క్వారెక్టర్, డ్యాన్స్‌లు అభిమానులు అలరించాయి. ఈ సినిమాలో బాలయ్య ఎనర్జి ఓ రేంజ్‌లో ఉంటుంది.

దీంతో పూరీ జగన్నాథ్‌తో బాలయ్య మరో సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇటీవల బాలయ్యకు పూరీ జగన్నాథ్ కథ చెప్పగా.. బాలయ్యకు కథ నచ్చినట్లు తెలుస్తోంది. గోపాల్, శ్రీవాసు సినిమాలు పూర్తైన తర్వాత పూరీతో బాలయ్య సినిమా చేసే అవకాశముంది. గతంలో బాలయ్య-శ్రీవాస్ కాంబినేషన్‌లో వచ్చిన డిక్టేటర్ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఆ తర్వాత బెల్లంకొండతో కలిసి శ్రీవాస్ సాక్ష్యం చేసినా చేసినా.. అంది కూడా డిజార్టర్‌గా మిగిలింది.