డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి బాలయ్య న్యూ మూవీ

balakrishna

దర్శకులతో కాన్ఫిడెంట్ గా సినిమాలు తీసే హీరోల్లో బాలకృష్ణ ఒకరు. ఒకసారి ఆయన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటే అందులో ఎలాంటి మార్పు ఉండదు. వీలైనంత వరకు దర్శకులకు ఫ్రీడమ్ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తారు. ఇక పూరిజగన్నాథ్ లాంటి దర్శకుడితో కలిసి మరోసారి వర్క్ చేసేందుకు ఆయన చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో పైసా వసూల్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఆ సినిమా అంతగా వర్కౌట్ కాలేదు. అయినప్పటికీ పూరి జగన్నాథ్ తో మరోసారి సినిమా చేయాలని బాలకృష్ణ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక పూరి కూడా బాలయ్య కోసం ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. తనదైన శైలిలో మరోసారి బాలకృష్ణను డిఫరెంట్ గా చూపించాలని అనుకుంటున్నాడట. అయితే ఇటీవల ఒక స్టోరీ లైన్ పై వీరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. ఆ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.