మెగాస్టార్ కోసం టార్గెట్ సెట్ చేసుకున్న బాలయ్య దర్శకుడు

boyapati srinu target for chiranjeevi movie

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విజయవంతమైన దర్శకులలో బోయపాటి శ్రీను ఒకరు. ఈ దర్శకుడు ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. వినయ విధేయ రామ ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో చిరంజీవి బోయపాటి శ్రీనుతో కలిసి ఒక చిత్రాన్ని బహిరంగంగా ప్రకటించారు, కాని ఆ తర్వాత ఈ ఎందుకో అంతా సైలెంట్ అయ్యారు.

అందుకు కారణం మెగాస్టార్ చిరంజీవి వేరే సినిమాలతో బిజీగా ఉండడమేనని తెలుస్తోంది. ఇక ఫైనల్ గా లాక్ డౌన్ లో కథను సెట్ చేసుకున్న ఈ యాక్షన్ దర్శకుడు చిరంజీవికి కూడా చెప్పాడని టాక్ వస్తోంది. ఇక ప్రస్తుతం మెగాస్టార్ ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్టు తరువాత మెహర్ రమేష్, బాబీ, వివి.వినాయక్ వంటి దర్శకులను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఆ సినిమా తరువాత బోయపాటి ప్రాజెక్టును స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇక బోయపాటి బాలయ్యతో సినిమా చేసిన తరువాత దిల్ రాజు ప్రొడక్షన్ లోనే ఒక సినిమాను చేసి 2022లో మెగాస్టార్ సినిమాను సెట్స్ పైకి తేవాలని ఒక టార్గెట్ సెట్ చేసుకున్నట్లు సమాచారం.