మెగాస్టార్ చెల్లి పాత్రలో మహానటి ఫిక్స్

keerthy suresh

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గ్యాప్ లేకుండా వరుసగా ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. ఆరు పదుల వయసులో యువ హీరోలకు ఏ మాత్రం తీసిపోని ఎనర్జీని చూపిస్తున్నారు. రానున్న రోజుల్లో మెగాస్టార్ ఫుల్ బిజీ కానున్నారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక కోలీవుడ్ హిట్ మూవీ వేదళం రీమేక్ ని వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నా మెగాస్టార్ ఆ సినిమాకు సంబంధించిన క్యారెక్టర్స్ విషయంలో కూడా తనదైన శైలిలో సలహాలు ఇస్తున్నాడట.

వేదళం రీమేక్ లో సిస్టర్ పాత్ర చాలా కీలకం. అయితే మొదటగా ఆ పాత్ర కోసం సాయి పల్లవిని అనుకున్నారు. ఆ తరువాత ఒరిజినల్ కథలో నటించిన లక్ష్మీ మీనన్ ని కూడా ఫైనల్ చేశారని టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు ఫైనల్ గా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కీర్తి సురేష్ ఆఫర్ తన వద్దకు రాగానే పెద్దగా ఆలోచించకుండా మెగాస్టార్ చిరంజీవి కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. మరి ఆ పాత్ర ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.