Bollywood: చెక్ బౌన్స్ కేసు చిక్కుల్లో ప‌వ‌ర్‌స్టార్ హీరోయిన్..

Bollywood: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్ న‌టించిన బ‌ద్రీ సినిమాలో హీరోయిన్‌గా చేసిన అమీషా ప‌టేల్ గుర్తుంది క‌దా.. వివ‌రాల్లోకి వెళితే.. జార్ఖండ్ కోర్టులో ఒక బిజినెస్ మ్యాన్ దాఖ‌లు చేసిన చీటింగ్ కేసులో అమీషాకు తాఖీదులు అంద‌డం చ‌ర్చ‌నీయంశం అయింది. ఈ భామ న‌టించిన దేశీ మ్యాజిక్ సినిమాపై అత‌డు పెట్టుబ‌డులు పెట్టిన‌ట్లు తెలిసింది. కాగా ఆనంద్ సేన్ అనే జార్ఖండ్ హైకోర్టు అడ్వ‌కేట్ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఈ కేసును ఫాలోప్ చేస్తున్నారు. Bollywoodఆ చిత్రం నిర్మాణంలో భాగంగా అమీషా ఖాతాకు రూ. 2.5కోట్లు బ‌దిలీ చేసిన‌ట్లు తెలిసింది.

amisha patel news

కానీ ఆ చిత్రం రిలీజ్ కాక‌పోవ‌డంతో అత‌ను ఆ డ‌బ్బును తిరిగి ఇవ్వాల్సిందిగా అమిషాను కోరాడు. దీంతో ఆమె చెక్ రూపంలో ఆ మొత్తాన్ని పంపించింది. కానీ ఆ చెక్ బౌన్స్ అయింది.. ఇక దీనిపై ఆయ‌న పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఈ విష‌యంపై రెండు వారాల త‌ర్వాత జ‌ర‌గ‌నుంది.. అస‌లు ఆ Bollywoodసినిమాను తీయ‌డానికి ఆమె స‌హ‌క‌రించ‌లేద‌ని.. మూవీని తీయ‌లేద‌ని అత‌ను ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక ఈ విష‌యంపై అమీషా అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. ఇక అమీషా ప్ర‌స్తుతం సినిమా అవ‌కాశాలు ల్లేక హాట్ హాట్ ఫోటోల‌తో సోష‌ల్ మీడియాలో ఒక ఊపు ఊపేస్తోంది. తెలుగులో ఈ అమ్మ‌డు బ‌ద్రీ త‌ర్వాత‌, నాని చిత్రంలో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. ఆ త‌ర్వాత Bollywoodబాలీవుడ్‌లో అడుగుపెట్టి .. అక్క‌డనే సెటిల్ అయిపోయిన విష‌యం తెలిసిందే.