మరణించిన ‘పవన్ కళ్యాణ్’ అభిమానుల కుటుంబాలకు ‘అల్లు అర్జున్’ విరాళం!!

ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సినీ తారలు భారీ స్థాయిలో విషెస్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ముగ్గురు అభిమానులు ఇటీవల ఉహీంచని ప్రమాదానికి గురవ్వడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అభిమాన నటుడి బ్యానర్‌ను కట్టడానికి ప్రయత్నం చేసి ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పంకు చెందిన ముగ్గురు యువకులు కరెంట్ షాక్ వలన ప్రాణాలు కోల్పోయారు.

ఇక బాధిత కుటుంబాలకు మెగా ఫ్యామిలీ సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. రామ్ చరణ్ 2.5లక్షల రూపాయలను అంధించగా అదే తరహాలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ అభిమానుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ” నిన్న జరిగిన ప్రమాదంలో పవన్ కళ్యాణ్ గారు అభిమానులు మరణించడం వలన నేను చాలా బాధపడ్డాను. వారి కుటుంబాలకు & ప్రియమైన వారికి నా ప్రగాడసంతాపం. కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం ద్వారా నా మద్దతును అందించాలనుకుంటున్నాను. స్వచ్ఛందంగా వారి మద్దతు, ప్రేమను అందిస్తున్న అభిమానులకు, ప్రజలందరికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను అని బన్నీ వివరణ ఇచ్చారు.