పరీక్ష రాయడానికి కాలేజ్ కి వెళ్లిన ‘సాయి పల్లవి’.. ఎందుకంటే?

ఎప్పుడైతే మలయాళం ప్రేమమ్ సినిమాలో కనిపించిందో అప్పటి నుంచే సాయి పల్లవి సౌత్ ఆడియెన్స్ కి బాగా దగ్గరైంది. ఇక ఫిదా సినిమాతో మరింత క్రేజ్ అందుకొని కుర్రాళ్ళ ఫేవరేట్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే రీసెంట్ గా సాయి పల్లవి ఎవరు ఊహించని విధంగా ఒక పరీక్ష రాయడానికి కాలేజ్ వద్ద కనిపించడం అందరిని ఆశ్చర్యపరిచింది.

అసలు సాయి పల్లవి పరీక్ష రాయడం ఏమిటని కొందరు ఆశ్చర్యపోయారు. సోషల్ మీడియాలో కూడా ఫొటోలు వీడియోలు బాగానే వైరల్ అయ్యాయి. ఇక ఈ ఫిదా బ్యూటీ గతంలోనే విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసింది. ఇక తిరుచిలోని ఎంఏఎం కాలేజీలో ఫారీన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎమ్‌జీఈ) పరీక్షకు హాజరయ్యారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో డాక్టర్‌గా రిజిస్టర్ చేసుకోవడం కోసం సాయి పల్లవి ఈ పరీక్ష రాసినట్లు సమాచారం. ఇక నెక్స్ట్ ఈ కేరళ కుట్టి లవ్ స్టొరీ, విరాట పర్వం సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.