టాలీవుడ్‌లో మరో బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. ఈ సారి వెంకీ, రానా

టాలీవుడ్‌లో మరో పెద్ద మల్టీస్టారర్ సినిమాకు రంగం సిద్ధమవుతోంది. బాబాయి వెంకటేష్, అబ్బాయ్ రానా కలిసి ఒక సినిమా చేయనున్నారని సమాచారం. బాబాయ్ వెంకటేష్‌తో కలిసి ఒక సినిమా చేయనున్నానని, ఇటీవల దీనికి సంబంధించిన ప్రాజెక్ట్‌పై సైన్ కూడా చేసినట్లు ఇటీవల రానా కూడా ప్రకటించాడు.

venkatesh rana

లాక్‌డౌన్‌లో చాలా కథలు విన్నానని, విన్న కథల్లో ఒకటో నచ్చడంతో ఇద్దరం కలిసి సినిమా చేస్తున్నట్లు రానా చెప్పాడు. ఈ సినిమా ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుటుందని రానా చెప్పుకొచ్చాడు. అయితే సురేష్ బాబు బ్యానర్ ఈ సినిమాను నిర్మించనుందని టాక్..

దర్శకుడు ఎవరనే విషయం మాత్రం ఇంకా బయటికి రాలేనప్పటికీ ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం రానా నటించిన అరణ్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా.. విరాటపర్వం అనే సినిమా తెరకెక్కుతోంది.