మహేష్, త్రివిక్రమ్ మల్టీస్టారర్.. మరో హీరో కూడా ఫిక్స్

ఖలేజా చిత్రం విడుదలై పదేళ్లు పూర్తి కావడంతో మహేష్ బాబు త్రివిక్రమ్‌తో పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకున్న విషయం తెలిసిందే. నటుడిగా తిరిగి ఆవిష్కరించుకోవడానికి ఆ సినిమా ఎంతగానో సహాయపడిందని మహేష్ బాబు వారి కలయికలో ఒక చిత్రం కూడా రానున్నట్లు చెప్పకనే చెప్పారు. అలాగే గత కొంతకాలంగా వీరి కాంబినేషన్స్ పై కొన్ని రూమర్స్ కూడా రావడంతో చివరికి అదే నిజమైంది.

అయితే ఆ సినిమా మల్టీస్టారర్ గా రూపొందనుందట. త్రివిక్రమ్.. మహేష్ బాబు, వెంకటేష్ లతో కలిసి మల్టీస్టారర్ కోసం సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాల్లో ఇది వరకే మహేష్, వెంకటేష్
కలిసి నటించిన విషయం తెలిసింది. ఇక ఇప్పుడు మరోసారి త్రివిక్రమ్ కథలో కలిసి నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తుండగా మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక మహేష్ రాజమౌళి ప్రాజెక్టు తరువాతే ఈ మల్టీస్టారర్ తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.