లక్ష్మీ బాంబ్ ట్రైలర్..ఓటీటీలో హిట్టు కొట్టేలా ఉన్నారు

ఫైనల్ గా అక్షయ్ కుమార్, కియారా అద్వానీ నటించిన లక్ష్మీ బాంబ్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ మూవీ OTT ప్లాట్‌ఫాం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందెన్నడూ చూడని అవతారంలో అక్షయ్ కనిపించబోతున్నట్టు ఫస్ట్ లుక్ నుంచే మంచి హైప్ క్రియేట్ చేశారు. ఇక ఫైనల్ గా ట్రైలర్ కూడా ప్రేక్షకులలో అంచనాల డోస్ ని పెంచింది.

రాఘవ లారెన్స్ కాంచన సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా కథలో చాలా మార్పులు చేసినట్లు అర్ధమవుతోంది. లక్ష్మణ్, లక్ష్మీ అనే పాత్రలలో అక్షయ్ నటించిన విధానం సినిమాలో హైలెట్ కానున్నట్లు ట్రైలర్ లోనే క్లారిటీ ఇచ్చేశారు. కబీర్ సింగ్ బ్యూటీ కీయరా అద్వానీ మరో బాక్సాఫీస్ హిట్ అందుకునేలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మార్చ్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ సమ్మర్ లోనే సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఇక కోవిడ్ వలన ఇప్పుడు ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమా ఓటీటీ వరల్డ్ లో ఎలాంటి రికార్డును క్రియేట్ చేస్తుందో చూడాలి.