హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తమన్నా.. ఇప్పుడు ఎలా ఉందంటే.

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల హైదరాబాద్‌కు రాగానే కరోనా భారిన పడిన విషయం తెలిసిందే. షూటింగ్స్ కోసమని దాదాపు ఆరు నెలల తరువాత ముంబై నుంచి తిరిగి వచ్చిన ఆమె తదుపరి ప్రాజెక్ట్ యొక్క పనిని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న సమయంలో గత వారం కరోనావైరస్ భారిన పడింది. ఇక మొత్తానికి తమన్నా కరోనా వైరస్ నుంచి కొలుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చింది.

కొన్ని రోజుల క్రితం పరీక్షల్లో కోవిడ్ 19 పాజిటివ్ అని తేలడంతో వెంటనే ఆమె నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఇక వైద్యులు సోమవారం ఆమెను డిశ్చార్జ్ చేసినట్లు చెబుతూ.. ప్రస్తుతం తన ఆరోగ్యం కొంచెం కొంచెంగా మెరుగుపడుతోందని అయితే మరికొన్ని రోజులు క్వారంటైన్ లోనే ఉండాలని వైద్యులు సూచించినట్లు తెలిపింది. ఇక తనకోసం ప్రార్దించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు తమన్నా ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చింది. ఇక తమన్నా తల్లిదండ్రులు రెండు నెలల క్రితం కరోనావైరస్ భారిన పడి త్వరగానే కొలుకున్నారు. తమన్నా గత ఆరు నెలలుగా తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఇక ఇటీవల హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన వెంటనే కరోనా భారిన పడ్డారు. అలాగే ఆమె త్వరగానే కోలుకోవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.