సుశాంత్ డెత్: 90రోజుల్లో 3కోట్లు ఖర్చు పెట్టిన రియా చక్రవర్తి

హీరోయిన్ రియా చక్రవర్తి తన జీవితంలో మొదటిసారి కోర్టు వివాదాలతో తీవ్రంగా సతమతమవుతోంది. ఆమె ప్రియుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి చెందినప్పటి నుంచి రియా చుట్టూ ఎదో ఒక ఆరోపణలు తిరుగుతూనే ఉన్నాయి. ఇక ఇటీవల ఆమె బ్యాంకుకి సంబంధించిన వివరాలపై ఆసక్తికరమైన అంశాలు బయటకు వస్తున్నాయి.

రియాపై సుశాంత్ తండ్రి కేకే సింగ్ బీహార్ పోలీస్ స్టేషన్ లో FIR నమోదు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 15కోట్ల వరకు ఆమె తన కొడుకు నుంచి కాజేస్తినట్లు పిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై ఆరా తీసిన పోలీసులు రియా 90రోజుల్లో సుశాంత్ ఎకౌంట్ నుంచి దాదాపు 3కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అలాగే రియా ఎక్కువగా సినిమాల ద్వారా ఆదాయాన్ని అందుకోకపోయినప్పటికి ఆమె దగ్గర కోట్ల రూపాయలు ఎలా ఉన్నాయని ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆరోపణలు చేశారు. దీంతో ఈ విషయంలో రియా ఊహించని ఇబ్బందులు ఎదుర్కొంటోంది.