మహేష్ కోసం విలన్ గా సీనియర్ హీరో..?

mahesh babu

మహేష్ బాబు నుంచి రాబోయే సోషల్ డ్రామా సర్కారు వాటి పాట కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. టాలీవుడ్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ చిత్రం షూటింగ్ USAలో నవంబర్ నుండి ప్రారంభమవుతుంది. భారీ బడ్జెట్ లో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే సినిమాలో ప్రతినాయకుడిగా నటించబోయేది ఎవరనే విషయం గురించి నాన్-స్టాప్ రూమర్స్ వస్తున్నాయి. ఇటీవల శాండల్ వుడ్ స్టార్ ఉపేంద్ర, మహేష్ ను ఒక విలన్ పాత్రతో ఎదుర్కోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ప్రసిద్ధ తమిళ స్టార్ అరవింద్ స్వామి మెయిన్ విలన్ గా సెలక్ట్ చేసుకోవాలని దర్శకుడు చర్చలు జరుపుతున్నారు. ఈ విషయంలో చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గత కొంతకాలంగా అరవింద్ స్వామి విలన్ పాత్రల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాడు. ఇదివరకే ధృవ సినిమాలో విలన్ గా కనిపించి తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.